గుంటూరు, నవంబర్ 30 : ఆంధ్ర అమ్మాయిలు తమ క్రికెట్ ప్రతిభతో, గుంటూరు వేదికగా బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న, మహిళల అండర్-19 లీగ్ టోర్నమెంట్లో విజయం సాధించారు. ముంబైతో ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించారు.ఈటోర్నమెంట్లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్లు ఆడిన ఆంధ్రా అమ్మాయిల జట్టు అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం గమనార్హం. తమ అమోఘమైన ఆటతో టోర్నీని కైవాసం చేసుకున్న మహిళల టీంకు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఆధికారులు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో రెండోసారి ఆంధ్రా మహిళా జట్టు విజేతగా నిలిచింది.