తుది శ్వాస వరకు జగన్ వెంటే: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

SMTV Desk 2017-11-30 16:05:48  rayachoti mla, srikanth reddy, ycp, pressmeet

కడప, నవంబర్ 30: ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న వేల రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి స్పందించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటనే నడుస్తానని, వైసీపీ ని వీడేదిలేదని ఆయన ప్రకటించారు. నీతిమాలిన రాజకీయాలు చేయడం తనవల్ల కాదని, తనను నమ్ముకున్న జగన్ ను, ప్రజలను ఎప్పటికి మోసం చేయనని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి పలువురు బయటికి వెళుతున్నారని, వారు విశ్వసనీయత లేని నేతలని, వాళ్ల జన్మలో అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మీడియాలో ప్రచారం చేస్తూ తనపై అధికార టీడీపీ నాయకులు తనపై మానసిక దాడి చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి బాధపడ్డారు. తనను సంప్రదించానని ముందుకు వచ్చి చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లడుతున్నారని, ఎమ్మెల్యే లు పోయినా ప్రజలు తమవెంటే ఉన్నారని శ్రీకాంతరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దుష్టపాలన అంతమయి జగన్ నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలు ఓపిక పట్టాలని ఆయన పిలుపునిచ్చారు.