ఐపీఎల్ మ్యాచ్ ల సమయం మారనుందా...?

SMTV Desk 2017-11-30 14:18:18  ipl, match timings, chairman rajiv shukla, star india

న్యూఢిల్లీ, నవంబర్ 30 : 2018 లో జరిగే ఐపీఎల్ 11 వ సీజన్ మ్యాచ్ జరిగే వేళల్లో మార్పు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంతక ముందు టోర్నీలో తొలి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, తర్వాత మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభించేవారు. దీని వల్ల రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌ ముగిసే సరికి అర్ధరాత్రి దాటుతోంది. మ్యాచ్ తర్వాత ప్రేక్షకులు ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఇంటి దగ్గర ఉండి చూసే ప్రేక్షకులు సైతం మ్యాచ్‌లను చూడలేకపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు వచ్చే ఏడాది నుంచి తొలి మ్యాచ్‌ను మధ్యాహ్నం 3 గంటలకు, రెండవది సాయంత్రం 7గంటలకే నిర్వహించేందుకు ఆధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇదే విషయం పై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ " డిసెంబరు 5న దిల్లీలో స్టార్‌ ఇండియా ప్రతినిధులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని వారి ముందు ప్రస్తావించి, వారు అంగీకరిస్తే రోజూ తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3 గంటలకు, రెండోది సాయంత్రం 7గంటలకే నిర్వహిస్తాం’అని వ్యాఖ్యానించారు.