హైదరాబాద్, నవంబర్ 30 : జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఇవాంకా ట్రంప్ పర్యటన ముగిసింది. గత రెండు రోజులుగా నగరంలో సందడి చేసిన ఆమె కాలినడకన చారిత్రక గోల్కొండ కోటను సందర్శించి అందరి మనసులను ఆకట్టుకున్నారు. ఫలక్ నుమా ప్యాలస్ లో ప్రధాని ఇచ్చిన విందుకు హాజరైన ఆమె చాలా నిరాడంబరంగా వ్యవహరించారు. కాగా పర్యటన ముగించుకొని ఇవాంకా నిన్న తిరిగి అమెరికా ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పర్యటన విషయాలను ఆమె తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. "అమెరికాకు తిరిగి బయలుదేరే ముందు ప్రతినిధులతో కలిసి గోల్కొండ కోటను సందర్శించాను. అద్భుతమైన ఈ పర్యటనకు ఇది పరిపూర్ణ ముగింపు" అని ట్వీట్ చేశారు.
Tour of Golkonda Fort with members of the US delegation prior to departing Hyderabad. The perfect end to a remarkable visit. #GES2017 pic.twitter.com/HNYeBe4FdB
— Ivanka Trump (@IvankaTrump) November 29, 2017