తరంగ ఔట్...పెరీరా ఇన్

SMTV Desk 2017-11-30 11:03:38  srilanka, odi captain tisara perira, mathews, sri lanka board

కొలంబో, నవంబర్ 30 : పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో శ్రీలంక జట్టుకు సారధిగా తిసార పెరీరా వ్యవహరించనున్నారు. భారత్ తో త్వరలో జరగబోయే వన్డే, టీ-20 సిరీస్ లకు ఈ సీనియర్ ఆటగాడని ఎంపిక చేస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇటీవల లంక జట్టు ఉపుల్ తరంగ సారధ్యంలో వరుస వైఫల్యాలు చెందడంతో అతడిపై వేటు వేసింది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఏంజెలో మాథ్యూస్‌ పేరు కూడా పరిశీలనకు వచ్చినా అతను తరచూ గాయాల బారిన పడుతుండడంతో సెలెక్టర్లు పెరీరా వైపు మొగ్గు చూపారు. 2009 డిసెంబర్‌లో అరంగేట్రం చేసిన పెరీరా ఇప్పటి వరకు 125 వన్డేలు ఆడి 108.26 స్ట్రైక్ రేట్‌తో 1,441 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 32.62 సగటుతో 133 వికెట్లు తీశాడు.