చైనా, నవంబర్ 29 : సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే బస్సు లోపల కూర్చుంటాం..కానీ చైనాలోని ఇద్దరు చిన్నారులు ఏకంగా బస్సు కింద ఉండి ప్రయాణించారు. బస్సు కింద ఉన్న ఉన్న కొద్ది ఖాళీ స్థలంలో వారిద్దరూ కూర్చొన్నారు. అలా ఏకంగా 80కిమీ దూరం ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే... చైనాకు చెందిన ఇద్దరు చిన్నారులు నవంబర్ 23న తప్పిపోయారు. గువాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉండే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లేందుకు వారి దగ్గర డబ్బులు లేవు. దీంతో ఆ చిన్నారులు, ఓ బస్ స్టేషన్లో నిలిపి ఉంచిన బస్సు అండర్క్యారేజ్ కింద కూర్చున్నారు. ఇద్దరి వయసు సుమారు ఎనిమిది, తొమ్మిదేళ్లు ఉంటాయి. వారిద్దరి శరీరం బాగా సన్నగా ఉండటంతో బస్సు కింద సరిపోయారు. ఓ ప్రదేశంలో బస్సు ఆగగా వెనుక నుంచి కొందరు గమనించి డ్రైవర్కు చెప్పడంతో ఆ చిన్నారులను బయటకు తీసి పోలీసులకు అప్పగించారు.