హైదరాబాద్, నవంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం ఇవాంకా ట్రంప్ కు గోల్కొండలో విందును ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఇవాంకా గోల్కొండ కోటకు చేరుకున్నారు. ఆమె రాకతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. భారీ బందోబస్తు నడుమ ఇవాంకా అక్కడకు చేరుకోగా ఆమె వెంట ప్రభుత్వం తరపున సీఎస్ హాజరయ్యారు. అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండకు హాజరుకాలేకపోయారు. కాలినడకన కోట చుట్టూ తిరుగుతున్న ఇవాంకాకు ఇద్దరు టూరిస్ట్ గైడ్ లు అక్కడి చారిత్రాత్మక విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ౦ కోటలో 12 స్టాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.