జియో నుంచి మరో శుభవార్త..!

SMTV Desk 2017-11-29 14:47:56  jio, triple cash back offer, jio 4g, jio new offers

ముంబై, నవంబర్ 29: జియో తాజాగా తమ వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. రిలయన్స్ జియో గత కొద్ది రోజుల క్రితం తన కస్టమర్లకు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆఫర్‌కు గడువును మొదట ఈ నెల 25వ తేదీ వరకు నిర్ణయించింది. కానీ వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనతో గడువు తేదీని మరికొద్ది రోజులు పొడిగించింది. దీంతో డిసెంబర్ 15వ తేదీ వరకు జియో కస్టమర్లు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా వినియోగదారులు రూ.399 ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రీఛార్జి చేసుకుంటే వారికి రూ.400 విలువ గల 8 ఓచర్లు లభిస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. దీంతోపాటు కస్టమర్లకు రూ.1899 విలువైన డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి. వీటిని ఆజియో, యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వాడుకోవచ్చు. ఇక జియో పార్ట్‌నర్ వాలెట్ యాప్స్ అయిన అమెజాన్ పే, పేటీఎం, ఫోన్ పే, మొబిక్విక్‌లలో జియో యూజర్లు రీచార్జి చేసుకుంటే వారికి రూ.300 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనితో జియో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేశారు.