ఉత్తరప్రదేశ్, నవంబర్ 29: ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే మరో సారి వార్తల్లో నిలిచింది. అందరినీ అలరించి, నోరూరించే మ్యాగీ నూడిల్స్ మళ్లీ చిక్కుల్లో పడింది. ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించిన ఫుడ్ క్వాలిటీ టెస్టులో విఫలమైంది. ఈ నేపథ్యంలో యూపీలోని షాజహాన్ పూర్ పరిపాలనాశాఖ అధికారులు నెస్లీ ఇండియా, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులకు భారీ జరిమానా విధించారు. సంస్థ నెస్లేకు రూ. 45 లక్షలు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు రూ. 15 లక్షలు, ఇద్దరు అమ్మకందారులకు రూ. 11 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. సరైన నిబంధనలను పాటించకపోవడం వల్లే నెస్లే ఇండియాకు జరిమానా విధించామని, జిల్లా ఆధికారులు తెలిపారు.