హైదరాబాద్, నవంబర్ 28 : మహిళా సాధికారత పైనే కాకుండా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా హెచ్ఐసీసీలో చర్చ జరగాలని సినీ నటి పూనమ్ కౌర్ తెలియజేశారు. హైదరాబాదులోని జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సదస్సుకు హాజరైన పూనమ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో మృతి చెందిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్, ఫెమీనా మిస్ ఇండియా యూనివర్స్ నఫీసా జోసెఫ్ వంటి వారు మహిళల సమస్యలపై పోరాడితే వారిని నిర్దాక్షిణ్య౦గా అంతమొంది౦చారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇలాంటి చర్చలపై, సమస్యలపై అంతర్జాతీయ స్థాయి చర్చ జరిగితే అప్పుడు విజయవంతమైనట్టుగా భావించాలని పూనమ్ ఆకాంక్షించారు.