గ్లోబల్ సమ్మిట్ లో మహిళా పారిశ్రామికవేత్తల ప్రసంగం..

SMTV Desk 2017-11-28 13:14:14  GES meeting, Successful Womens, nara bramhini, manchu lakshmi, konidela upasana speeches.

హైదరాబాద్, నవంబర్ 28 : హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సదస్సులో పాల్గొని ప్రసంగించే అపూర్వ అవకాశాన్ని విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలు నారా బ్రాహ్మణి, మంచు లక్ష్మి, కొణిదెల ఉపాసన దక్కించుకున్నారు. వీరు ఈ సదస్సులో మహిళల్లో ఔత్సాహికత, మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే సవాళ్లు, వారి జీవితాల్లో సమతుల్యం వంటి అంశాలపై మాట్లాడనున్నారు. ఇంతటి ఘనమైన అవకాశం లభించడంపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. "భారత మహిళల తరఫున మాట్లాడే అవకాశం లభించడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సదస్సులో ఎన్నో కేటగిరీలు ఉండగా, సినిమాల్లో మహిళలు, వారి పాత్రపై నేను మాట్లాడాలని నన్ను పిలవలేదు. నా స్వీయ అనుభవాలను, నా జీవితం నాకు నేర్పిన పాఠాలను ఇక్కడ పంచుకోబోతున్నా. ఆపై జరిగే చర్చలో నా అభిప్రాయాలను వెల్లడిస్తాను" అని తెలిపారు.