హైదరాబాద్, నవంబర్ 28 : ఇండియా క్రికెట్ చరిత్రలో బిషన్సింగ్ బేడీ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పంజాబీ కి చెందిన ఈ క్రికెటర్ భారత్ తరపున 67 టెస్టులు, 10 వన్డేలు, 370 ఫస్ట్ క్లాసు మ్యాచ్ లు ఆడారు. తాజాగా ఢిల్లీలో జరిగిన టైమ్స్ సాహిత్య పండుగ-2017లో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. పాకిస్థాన్ పర్యటనకు ఆయన రమ్ము (ఆల్కహాల్) సీసాలు తీసికెళ్లిన సన్నివేశం చర్చకు వచ్చింది. ఈ విషయం పై రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ " ఇస్లామాబాద్కు రమ్ము సీసాలు తీసుకెళ్తున్న బేడీని నేను చూశాను. చూసిన వెంటనే, బేడీజీ విమానాశ్రయంలో వారు స్వాధీనం చేసుకుంటే ఏంటి పరిస్థితి? అని ప్రశ్నించాను. అందుకు సమాధానంగా బేడీ పాకిస్థాన్లోనా.. నేను బిషన్ సింగ్ బేడీని! అంటూ ధైర్యంగా బదులిచ్చారు. నిజంగానే విమానాశ్రయంలో దిగగానే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. అక్కడి కస్టమ్స్ అధికారి ఆయనకు సలాం చేసి వెళ్లిపోయారని" సర్దేశాయ్ తెలిపారు.