ఓటమిపై స్పందించిన చండిమాల్‌

SMTV Desk 2017-11-28 11:31:38  india, srilanka, chandimal, nagapur, comments

నాగ్‌పూర్‌,నవంబర్ 28 : భారత్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్ట్ లో లంకేయులుపై 239 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ టాప్ ఆర్డర్ దుమ్మురేపగా, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ల ధాటికి శ్రీలంక 166 పరుగులకే చాప చుట్టేసింది. మ్యాచ్ తర్వాత లంక కెప్టెన్ చండిమల్ మాట్లాడుతూ " మా ఓటమి మమ్మల్ని బాగా ఆవేదనకు గురిచేసింది. తొలి ఇన్నింగ్స్ లో మేము కనీసం 400 పరుగులైనా చేసి ఉండాల్సిందని, తొలి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు ఉంటేనే భారత్ ను నిలువరించే కలిగే వాళ్లమని " లంక సారధి తెలిపాడు. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిందని చండిమల్ కొనియాడారు.