దోహా, నవంబర్ 28 : ప్రముఖ భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అడ్వాణీ, మరోసారి అద్భుత ఆటతీరుతో ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.సోమవారం ముగిసిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో 32 ఏళ్ల పంకజ్ అడ్వాణీ చాంపియన్గా అవతరించాడు. ఫైనల్లో అడ్వాణీ 8-2తో అమీర్ సర్కోష్ (ఇరాన్)ను ఓడించాడు. ఈ పోరులో తొలుత కాస్త తడబడిన పంకజ్, ఆపై పుంజుకుని ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా విజేతగా నిలిచాడు.