ముంబై, నవంబర్ 27 : భారత్ జట్టు సారధి, పరుగుల వీరుడు, విరాట్ కోహ్లీ కి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. తదుపరి శ్రీలంక తో జరిగే మూడో టెస్ట్ కు కోహ్లీ కెప్టెన్ గా వ్యహరించునున్నట్లు తెలిపింది. డిసెంబరు 10 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్కి మాత్రం కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టీమిండియా సారధిగా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఐపీఎల్ నుండి విరాట్ విరామం లేకుండా ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య తాజాగా కోహ్లీ తన వరుస సిరీస్ లపై బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమైన అల్ రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. పంజాబీ యువ తేజం సిద్ధార్థ కౌల్ తొలి సారిగా జాతీయ జట్టులో చోటు సంపాదించుకొన్నాడు. టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్. వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్.