అమరావతి, నవంబర్ 27 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 2018 వ స౦వత్సరం మొదటి నెలల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 1 నుంచి చంద్రన్న పెళ్లి కానుకగా పేదలకు ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. చంద్రన్న బీమా పేరిట సహజ మరణ౦ సంభవిస్తే ఆ కుటుంబానికి రూ.2లక్షల బీమా అంది౦చనున్నట్లు చెప్పారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి డ్వాక్రా సంఘాల ద్వారా నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా హిజ్రాలకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.