నాగపూర్, నవంబర్ 27 : శ్రీలంకతో నాగ్పూర్లో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు, జడేజా, అశ్విన్ దెబ్బకు లంక ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో, 166 పరుగులకే కుప్పకూలిపోయారు. శ్రీలంక జట్టులో సారధి చందిమాల్ (57), కరుణరత్నే(51) ఆర్ధ శతకాలతో రాణించారు. 21/1 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఆట ప్రారంభించిన లంక స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓపెనర్ కరుణరత్నే, మాథ్యూస్ను జడేజా పెవిలియన్కు పంపగా శనక, పెరీరా, హెరాత్ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం విజయంతో కోహ్లీ సేన టెస్ట్ సిరీస్ లో 1-0 తో ముంద౦జలో ఉంది. తదుపరి టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా వచ్చే నెల 2 న జరగనుంది.