వైసీపీ ప్లీనరీకి..జగన్

SMTV Desk 2017-06-13 19:06:38  ys jagan, ycp, plinary, hyderabad, ycp plinary, plinary hyd,

హైదరాబాదులో ఈ నెల 22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ అధినేత వై స్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని టీవైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలపై కూడా మాట్లాడతామని తెలిపారు. కేసీఆర్ వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్ గా మారిందని మండిపడ్డారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.