చంద్రబాబుపై జేసీ సంచలన వ్యాఖ్యలు..

SMTV Desk 2017-11-27 10:41:58  tdp leader jc divakar reddy, comments on chandrababu naidu.

అనంతపురం, నవంబర్ 27 : తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు గానీ, తన సోదరుడికి గానీ మంత్రి పదవులు ఇవ్వరని వ్యాఖ్యానించారు. ఓ మీడియా ద్వారా స్పందించిన జేసీ.. ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితి చూసి చలించి పోతున్నానని అన్నారు. ఇక్కడ అంతా అవినీతి జరుగుతు౦దని, తాను మాత్రం అవినీతికి దూర౦గా ఉన్నానన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా జేసీ వ్యక్తం చేశారు.