గువహతి, నవంబర్ 27 : ఏఐబీఏ మహిళల యూత్ ప్రపంచ ఛాంపియన్షిప్లో, భారత్ మహిళా బాక్సర్లు పసిడి పతకాల పంట పండించారు. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లు విజేతలుగా నిలిచి తొలిసారి భారత్ను ఓవరాల్ చాంపియన్గా నిలబెట్టారు. కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షలకు అనుగుణంగా ఐదు పసిడి పతకాలతో సహా, రెండు కాంస్యాలతో సత్తాచాటారు. టోర్నీ చరిత్రలో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఆదివారం జరిగిన వేర్వేరు విభాగాల ఆఖరి పోరులో నీతు(48కి), జ్యోతి గులియా(51కి), సాక్షి చౌదరీ(54కి), శశి చోప్రా(57కి), అంక్షిత బోరో(64కి) ప్రత్యర్థులపై విజయాలతో స్వర్ణ పతకాలతో మెరువగా, నేహా యాదవ్(81+కి), అనుపమ(81కి) కాంస్కాలు సొంతం చేసుకున్నారు.