నెల్లూరు, నవంబర్ 26: నెల్లూరు జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. దొరవారిసత్రం మండలంలోని వడ్డికండ్రిగ మంగళపోలయ్య చెరువులో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆనేపూడి గ్రామానికి చెందిన జయకృష్ణ, ఆనేగొట్టం గ్రామానికి చెందిన వెంకట హేమంత్, రాకేశ్ మరో ఇద్దరితో కలిసి ఇవాళ ఉదయం ఈతకెళ్లారు. మట్టితీసిన గుంతలో పడిపోవడంతో మునిగిపోయారు. ఇది గమనించిన స్నేహితులు గ్రామస్థులకు విషయం తెలియజేశారు. స్థానికులు వచ్చేసరికి ముగ్గురు మరణించారు. గంటపాటు శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.