టీమిండియా 610/6 డిక్లేర్డ్‌...భారీ ఆధిక్యంలో కోహ్లీసేన

SMTV Desk 2017-11-26 17:23:57  team india, declare, nagpoor, second test

నాగ్‌పూర్, నవంబర్ 26‌: భారత్ టాప్ ఆర్డర్ దుమ్ము లేపారు. దీనితో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176.1 ఓవర్లు ఆడిన భారత్‌ 610/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌కు 405 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇన్నింగ్స్‌ 177వ ఓవర్‌ తొలి బంతికి మూడు పరుగుల సాధించి రోహిత్‌ శర్మ శతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డిక్లేర్‌ చేసి శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించాడు. భారత తొలిఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి(213), పూజారా(143), మురళీ విజయ్‌(128) అద్భుతంగా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. దీంతో ఒకే ఇన్నింగ్స్ లో నలుగురు భారత బ్యాట్స్ మన్ లు సెంచరీలు కొట్టినట్లయింది.