తెదేపా నూతన కార్యాలయం శంకుస్థాపన

SMTV Desk 2017-11-26 11:13:26  chandrababu naidu, telugu desham, mangalagiri, gunturu

గుంటూరు, నవంబర్ 26: గుంటూరు జిల్లా మంగళగిరిలో 3.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడానికి తలపెట్టిన తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకు స్థాపన చేశారు. ఆదివారం తెల్లవారుజామున 5: 17 నిమిషాలకు మూడు బ్లాకులుగా నిర్మించే ఈ భవన సముదాయానికి పూజ చేశారు. 2018 డిసెంబర్ నాటికి భవనాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిపాలన భవనాన్ని జీ+4 భవనంగా నిర్మిస్తారు. ఓ భవనంలో పార్టీ అధ్యక్షులు, కార్యదర్శుల కార్యాలయాలు, రెండో భవనంలో శిక్షణ కార్యక్రమాలు, మూడో భవనంలో పార్టీ నాయకులకు, బస ఏర్పాట్లు ఉండనున్నాయి.