దుమ్మురేపుతున్న కోహ్లీ, పుజారా

SMTV Desk 2017-11-25 17:07:01  india, srilanka test, pujara, murali vijay

నాగ్ పూర్, నవంబర్ 25 : శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆటగాళ్లు మురళీ విజయ్, పుజారా శతకం తో అలరించారు. పేసర్లు, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపెనర్‌ మురళీ విజయ్‌ 187 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. అయితే హేరాత్ వేసిన బౌలింగ్ లో 128 వ్యక్తిగత పరుగుల వద్ద విజయ్ పెవిలియన్ కు చేరాడు. మరోవైపు పుజారా(121) సైతం తనదైన శైలిలో పరుగులు చేస్తూ శతకంకు సాధించాడు. టీమిండియా సారధి కోహ్లీ, కేవలం 66 బంతులాడిన 5 ఫోర్ల సాయంతో ఆఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. భారత్‌ మెరుగైన స్థితిలో ఉండటంతో వేగంగా ఆడి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దిశించేల పుజారా(121), కోహ్లీ(54) ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ఇదే జోరు భారత్ కొనసాగిస్తే భారీ ఆధిక్యం లభించే అవకాశం ఉంది.