ప్రకాశం, నవంబర్ 25: ప్రకాశం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పామూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సర౦ చదువుతున్న విద్యార్ధి వెంట కోతులు పడడంతో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కోతుల నుండి తప్పించుకోబోయి ఒక్కసారిగా నల్లబల్ల మీద పడడంతో తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.