విజయవాడ, నవంబర్ 25: ఇంద్రకీలాద్రి కనక దుర్గ అమ్మవారిని దర్శించు కోవడానికి నాగ దేవత క్యూ లైన్లో నిలుచుంది. నాగదేవత రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. అవునండి. ఈరోజు అమ్మవారిని దర్శనానికి నిల్చున్న భక్తులకు పాము కనిపించడంతో, భయంతో భక్తులు పరుగులు తీశారు. క్యూలైన్ వద్ద అలజడి చెలరేగుతుండడంతో గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించారు.