బ్రిస్బేన్, నవంబర్ 25 : ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బూడిద యుద్ధంలో, ఆసీస్ సారధి స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడు. కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును కెప్టెన్ స్మిత్ తనదైన శైలిలో ఆడుతూ, తడబడకుండా క్రీజులో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 261 బంతులాడిన స్మిత్ టెస్టు కెరీర్లో తన 21వ శతకంని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం కంగారులు 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేశారు. క్రీజులో స్మిత్(114), హజిల్ వుడ్(2) ఉన్నారు.