రావల్పిండి, నవంబర్ 25 : రావల్పిండిలో జరిగిన నేషనల్ టీ-20 కప్ మ్యాచ్లో, పాక్ ఓపెనర్లు కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇస్లామాబాద్ రీజియన్-లాహోర్ రీజియన్ వైట్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో భాగంగా, లాహోర్ వైట్స్ ఓపెనర్లు బట్, అక్మల్లు చెలరేగిపోయారు. అక్మల్ (71 బంతుల్లో 150) , సల్మాన్ బట్ (49 బంతుల్లో 55) పరుగులు చేశారు. వీరిద్దరూ 20 ఓవర్లను పూర్తిగా ఆడటం విశేషం. అనంతరం లక్ష్య చేధనలో ఇస్లామాబాద్ రీజియన్స్ 100 పరుగులకు ఆలౌటయ్యింది. గతంలో అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం 171 పరుగుల రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కేన్ విలియమ్సన్ల పేరిట నమోదయ్యింది.