నాగ్పూర్, నవంబర్ 24 :శ్రీలంక తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో, టీమిండియా వికెట్ ను కోల్పోయింది. నాలుగో ఓవర్లో గమేజ్ వేసిన 5వ బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్(7) ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్(1), పుజారా(0) ఉన్నారు. శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయిన విషయం విదితమే.