భారత్ స్పిన్ ధాటికి శ్రీలంక బ్యాట్స్ మన్ విలవిల...

SMTV Desk 2017-11-24 16:24:59  nagpoor test, spin, aswin, jadeja,srilanka first inning

నాగపూర్, నవంబర్ 24: నాగపూర్ టెస్ట్ లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ స్పిన్ ధాటికి 205 పరుగులకే శ్రీలంక బ్యాట్స్ మన్ చేతులెత్తేసారు. భారత్ బౌలింగ్ లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు నాలుగు వికెట్లు దక్కగా, మరో స్పిన్నర్ జడేజా కు మూడు వికెట్లు, పేసర్ ఇషాంత్ కు మూడు వికెట్లు దక్కాయి. శ్రీలంక ఇన్నింగ్స్ లో చండీమల్, కరుణరత్నే లు చెరో హాఫ్ సెంచరీ సాధించగా మిగతా బ్యాట్స్ మన్ అంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. భారత్ బ్యాట్స్ మన్ శ్రీలంక స్పిన్ ను ఎదుర్కొని ఎలా రాణిస్తుందో చూడాలి.