కొలువుల కొట్లాటకు హైకోర్టు ఓకే!

SMTV Desk 2017-11-24 15:19:12  jac, high court, kodandaram, permission

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో కోదండరా౦ అధ్యక్షతన కొలువుల కొట్లాట పేరుతో నిర్వహించ తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే నవంబర్ ముప్పై, డిసెంబర్ ఒకటి, ఆరు తేదీలలో కాకుండా మిగిలిన రోజులలో ఎప్పుడైనా సభ జరపుకోవచ్చని హైకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తమకు అనుమతి నిరాకరిస్తోందని చెబుతూ జేఏసీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు తీర్పు వెలువరిస్తూ అనుమతి కోసం పోలీసులకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత నలభై గంటలలోగా అనుమతి ఇవ్వాలని పోలీసులకు సూచించింది. ఒక సభ జరపుకోవడానికి ఇన్ని ఇబ్బందులా? ఇది రాచరికమా లేక ప్రజాస్వామ్యమా అని జీఏసీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.