లాహోర్, నవంబర్ 24 : తాజాగా భారత్ కేంద్ర మంత్రిత్వశాఖ పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు భద్రత పరమైన కారణాల దృష్ట్యా నిరాకరించింది. అయితే ఈ విషయం పై పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ పై ఆగ్రహంతో ఉంది. అంతే కాకుండా ఏకంగా భారత్ క్రికెట్ బోర్డు పై ఈ మేరకు కేసు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలపై లండన్లో లాయర్లతో సంప్రదింపుల అనంతరం, ఐసీసీకి ఫిర్యాదు చేసి ఆపై బీసీసీఐపై కేసు వేసే యోచనలో ఉన్నట్టు పీసీబీ చైర్మన్ నజామ్ సేథి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సంవత్సరం ఇండియాలో జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ ఆడేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే.