రెండో రౌండ్ లోకి పంకజ్‌

SMTV Desk 2017-11-24 11:37:45  doha, pankaj adwani, World Snooker Championship,

దోహా, నవంబర్ 24 : భారత స్టార్‌ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన నాకౌట్‌ తొలి రౌండ్‌లో పంకజ్‌ 4–0 (79–13, 54–2, 139–0, 74–1) ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్‌ సలూమీ (యెమెన్‌)పై విజయం సాధించాడు. లీగ్‌ దశలో గ్రూప్‌ ‘బి’లో పోటీపడిన ఆడ్వాణీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ప్రధమ స్థానంలో నిలిచాడు.