నాగపూర్, నవంబర్ 23 : టీమిండియా క్రికెట్ పేసర్ భువనేశ్వర్ కుమార్, వివాహం కారణంగా సెలెక్టర్లు అనూహ్యంగా విజయ్ శంకర్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్య తరహా సామర్థ్యాలున్న విజయ శంకర్ కఠినమైన విదేశీ పర్యటనల్లో బ్యాకప్ ఆల్రౌండర్గా ఉపయోగపడతాడని కోహ్లీ చెప్పారు. ఈ విషయం పై భారత్ క్రికెట్ సారధి విరాట్ మాట్లాడుతూ " ‘విజయ్ శంకర్ నిలకడగా ప్రదర్శనలు చేస్తూ జాతీయ జట్టులో చోటు దక్కించుకొన్నాడు. మీడియం పేస్ బౌలింగ్, చక్కటి బ్యాటింగ్ చేయగల మరో ఆల్రౌండర్ను దృష్టిలో ఉంచుకొని అతడిని ఎంపిక చేశాం. హార్దిక్ పాండ్యకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నా. విదేశీ పర్యటనలప్పుడు మేం బ్యాకప్ ఓపెనర్ గురించి యోచిస్తున్నాం. టీమిండియాకు అలవాటు పడేందుకు ఇక్కడికి తీసుకొచ్చాం. నేను నెట్స్లో చూసినదాని ప్రకారం అతను దృఢమైన బ్యాట్స్ మెన్. అతడి జీవితంలో ఇదొక గొప్ప అవకాశం’అని కోహ్లీ వ్యాఖ్యానించారు.