కౌలూన్, నవంబర్ 23 : భారత స్టార్ షట్లర్ పివి సింధు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో క్వార్టర్స్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 21-14, 21-17 తేడాతో అయా ఒహోరి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం ప్రత్యర్ధి పై సింధు విరుచుకుపడింది. వరుస రెండు గేమ్లను సులభంగా గెలిచిన సింధు తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు. కేవలం 39 నిమిషాల్లోనే సింధు విజయం సాధించి మరొకసారి సత్తాచాటింది.