శ్రీనగర్, నవంబర్ 22 : మహేంద్రసింగ్ ధోని...నిరంతరం ఆటలతో విరామం లేకుండా గడిపే వ్యక్తి. అలాంటి ధోని స్కూల్ పిల్లలతో ముచ్చటించారు. అది కూడా క్రికెటర్ గా కాదు...దేశాన్ని కాపాడే సైనికుడి హోదాలో...సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ బుధవారం శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ పాఠశాలను సందర్శించాడు. అంతే కాకుండా విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ధోనీ, ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చినార్ కార్ప్స్ తన ట్విటర్ ద్వారా పంచుకుంది. ‘లెఫ్ట్నెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చదువు-క్రీడల ప్రాముఖ్యతను వారికి వివరించారు’ అని ట్వీట్లో పేర్కొంది. ధోని 2014 డిసెంబరు 30 న టెస్టుల్లో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు దొరికిన కాసేపు విరామ సమయాన్నిఝార్ఖండ్ డైనమేట్ ఇలా గడుపుతున్నారు.