ధీటుగా ఆడుతున్న ఇంగ్లాండ్

SMTV Desk 2017-11-23 15:20:30  ashes test series, england, australia, gabbastadium, brisben

బ్రిస్బేన్‌, నవంబర్ 23 : ఆసీస్- బ్రిటిష్ జట్ల మధ్య యాషెస్ యుద్ధం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ను ఎన్నుకోంది. ఆదిలోనే బ్రిటిష్ జట్టు కుక్ వికెట్ ను కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విన్స్‌-స్టోన్‌మన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఇద్దరూ ఆచి తూచి ఆడుతూ రెండో వికెట్‌కు అజేయంగా 112 పరుగులు సాధించారు. అనంతరం స్టోన్‌మన్‌(53), విన్స్‌(83) జోడిని ఆసీస్ ఆటగాళ్లు విడగొట్టారు. ఇంగ్లాండ్ సారధి రూట్ కూడా (15) పరుగులు చేసి, కుమ్మిన్స్ వేసిన చక్కటి బంతికి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం బ్రిటిష్ జట్టు 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. మాలన్(28), మొయిన్ అలీ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కుమ్మిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా, స్టార్క్‌ ఒక వికెట్ తీసుకోన్నాడు.