కర్నూలు, నవంబర్ 23: మాజీ ఎమ్మెల్సీ, తూర్పుగోదావరి డీసీసీ మాజీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు బుధవారం వైకాపా గూటికి చేరారు. పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఆయన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కలిశారు. జగన్ దొమ్మేటి వెంకటేశ్వర్లుకు వైకాపా జెండా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని, పార్టీ బలోపేతమే తన లక్ష్యమని వెంకటేశ్వర్లు మీడియా కు తెలిపారు.