న్యూఢిల్లీ, నవంబరు 23 : డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు గుజరాత్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగానున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ తేదీలను ఖరారు చేసింది. 22 రోజులు జరిగే సమావేశాల్లో 13 పనిదినాలు ఉంటాయి. క్రిస్మస్ సందర్భంగా పార్లమెంటుకు 2 రోజుల సెలవు ఉంటుంది. జనవరి 1న కూడా సమావేశాలు జరగబోవని తెలిసింది. ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.