హైదరాబాద్ , నవంబర్ 23 : పుణేకు చెందిన సెవా పోల్కెమ్ త్వరలో బ్రాయిలర్ కోళ్లలో వ్యాధి నిరోధక శక్తిని(ఇమ్యునిటి పవర్) పెంచే రెండు ప్రత్యేక వ్యాక్సిన్లను భారత విడుదల చేయనుంది. పౌలీ్ట్ర ఇండియా సదస్సుకు హాజరైన కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ మిలింద్ లిమిమాయే విలేకరులతో ఈ విషయం చెప్పారు. ఇందులో ‘ట్రాన్స్మ్యూన్ ఐబిడి అనే వ్యాక్సిన్ గంభోరా వ్యాధి నుంచి, వెక్టర్మునే ఎన్డి అనే వ్యాక్సిన్ రానికెట్ అనే జబ్బుల నుంచి కోళ్లకు రక్షణ కల్పిస్తాయని తెలిపారు. అమెరికా, ఫ్రాన్స్కు చెందిన కంపెనీల సాంకేతిక సహకారంతో సెవా పోల్కెమ్ కంపెనీ ఈ వ్యాక్సిన్లను ఉత్పతి చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు పిల్ల దశలోను ఇవ్వవచ్చునని, వీటి వలన కోళ్లలో వ్యాధులను తట్టుకొనే శక్తి పెరుగుతుందని సంస్థ ప్రతినిధి బృందం తెలిపారు.