తిరుచానూరు, నవంబర్ 23: ఏడుకొండల వేంకటేశుడి ప్రియసతి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా అమ్మవారికి పంచమి తీర్థం (చక్రస్నానం) నిర్వహించారు. వేదబ్రహ్మనోత్తముల నడుమ అమ్మవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుమల వెంకన్న తరుపున టిటిడి వారు పద్మమ్మకు సారె సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.