న్యూఢిల్లీ, నవంబర్ 23 : పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయిబ్ అక్తర్ దాదాపు బౌండరీ లైన్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తే, వీరేంద్ర సెహ్వాగ్ చాలా సులభంగా బౌండరీకి పంపిన సందర్భాలు కోకొల్లలు...అయితే అభిమానులకు మరల ఇలాంటి సన్నివేశం వీక్షించే ఆవకాశం దక్కనుంది. అది కుడా మాములు మైదానంలో కాదు...! మంచు మైదానంలో వీరు పోటీపడనున్నారు. స్విట్జర్లాండ్లోని సెయింట్ మోరిట్జ్లో గడ్డ కట్టిన సరస్సుపై వచ్చే ఏడాది రెండు ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8, 9న జరిగే ఈ మ్యాచ్ల్లో సెహ్వాగ్, అక్తర్లతో పాటు.. మహ్మద్ కైఫ్, మహేల జయవర్ధనె, లసిత్ మలింగ, మైకెల్ హసి, గ్రేమ్ స్మిత్, జాక్వస్ కలిస్, వెటోరి, నాథన్ మెక్కలమ్, గ్రాండ్ ఇలియట్, మాంటీ పనేసర్, ఒవైస్ షా లు కూడా ఆడనున్నారు.