వొడాఫోన్‌ సంస్థ బంపర్ ఆఫర్

SMTV Desk 2017-11-22 18:56:22  

న్యూఢిల్లీ, నవంబర్ 22 : రిలయన్స్ జియో తన సంచలన ఆఫర్ లతో టెలికాం సంస్థలకు సవాల్ విసురుతుంది. అందుకు ధీటుగా ఇతర సంస్థలు కుడా వినయోగాదారులను నిలుపుకోనేందుకు తమదైన శైలిలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఎయిర్ టెల్ సంస్థ జియో ను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. వొడాఫోన్‌ కుడా ఈ రెండింటికి పోటీగా నిలుస్తుంది. తాజాగా వొడాఫోన్‌ సంస్థ ప్రీపెయిడ్‌ చందాదారుల కోసం రూ.349 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద 28రోజుల కాల పరిమితితో రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన రూ.349 ప్లాన్‌కు దీటుగా వొడాఫోన్‌ ఈ ఆఫర్‌ను యూజర్లకు అందించింది.