విజయవాడ, నవంబర్ 22 : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పురుగుమందు తాగి రైతులు ఆత్మహత్యకు యత్నించారు. విజయవాడలోని పాయకాపురం పోలీస్స్టేషన్ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన బాధితులను తిరువూరు మండలానికి చెందిన పూర్ణయ్య, తిరుపతి, రామయ్యగా గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం నాసిరకం విత్తనాలతో పంట నష్టపోయిన రైతులు తమ గోడు వినిపించేందుకు కొంతమంది అసెంబ్లీకి ఈ ఉదయం బయల్దేరారు. మార్గమధ్యమంలో పోలీసులు వారిని రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పాయకాపురం పోలీస్స్టేషన్కు తరలించడంతో, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.