హైదరాబాద్, నవంబర్ 22: ఇటీవలే వివాహ వేడుకతో ఆనందిపజేసిన అక్కినేని నాగచైతన్య, ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి అభిమానుల కోసం ‘సవ్యసాచి’ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా, ప్రధాన పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ ప్రచార చిత్రంలో నాగచైతన్య కనిపిస్తున్న చాలా పవర్ఫుల్ లుక్ ప్రస్తుతం సోషల్మీడియాలో అభిమానుల్ని ఆకర్షిస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు.