అమరావతి, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్దికి ప్రపంచ సూచిలలో మెరుగైన స్థానాలు వస్తున్నాయి. తాజాగా సంతోషంగా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే డెబ్బైనాలుగో స్థానంలో ఉందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అభివృద్దితో పాటు ప్రజలంతా ఆనందగా ఉండాలనేది తమ ప్రభుత్వ భావన అని ఆయన అన్నారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. హ్యాపినెస్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఏపీ 74వ స్థానంలో ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుస్థిరాభివృద్ధితో సంతోషాంధ్రప్రదేశ్ సాధ్యపడుతుందని చెప్పారు. సుస్థిరాభివృద్ధికి ఐక్యరాజ్య సమితి తీసుకున్న 17 సూచీలను ఏపీ అన్వయించుకు౦దని ఈ సందర్భంగా యనమల తెలిపారు.