మోకాలి చిప్పల మార్పిడి ఆరోగ్యశ్రీ లోకి: జగన్

SMTV Desk 2017-11-22 15:33:15  arogyasri, jagan, padayathra, ambulance

అమరావతి, నవంబర్ 22: కర్నూల్ జిల్లా పాదయాత్రలో ప్రసంగించిన జగన్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని మరింత మెరుగ్గా అమలు చేస్తామని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇరవై నిమిషాలలో 108 అంబులెన్స్ కుయి,కుయి అంటూ చేరుకునేదని ఆయన గుర్తుచేశారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితి మారుస్తాం. కిడ్నీ రీప్లేస్‌మెంట్‌కు డబ్బులు ఇస్తాం. కిడ్నీ రోగులకు రూ.10 వేల పింఛను అందజేస్తాం. మోకాళ్ల మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయిస్తాం. హైదరాబాద్‌లో మళ్లీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలందిస్తాం. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మనం అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని జగన్ చెప్పారు.