అనంతపురం, నవంబర్ 22: ఇవాళ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ వర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తన విలువైన అనుభవాలను విద్యార్ధులతో పంచుకోనున్నారు. కాగా వెంకయ్యనాయుడు రాకకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు మీడియాకు తెలిపారు.