వాషింగ్టన్, నవంబర్ 22 : హైదరాబాద్ లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు-2017కు అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంకా ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్లో థ్యాంక్స్ గివింగ్ వేడుక తర్వాత ఇవాంకా ట్రంప్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రెండు దేశాల మధ్య ‘దృఢమైన స్నేహబంధం’కు నిదర్శనమని ఇవాంకా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన పర్యటన విజయవంతం అవుతుందని తెలిపారు. ‘భారత్ మాకు గొప్ప మిత్రదేశం. అంటూ భద్రత, ఆర్థిక రంగాల్లో మెరుగవ్వడం మా భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని ఇవాంకా తెలిపారు. కాగా, నగరంలోని ఇవాంక పలు ప్రాంతాలను పర్యటించనున్నారు.