ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు : కపిల్ దేవ్

SMTV Desk 2017-11-22 10:41:31  kapil dev, fomer cricket player, india, busy schedule

హైదరాబాద్, నవంబర్ 22 : క్రికెట్ ఆటగాళ్లు కావాలంటే ఆటల నుండి విశ్రాంతి తీసుకోవచ్చని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్‌, ఒత్తిడి కారణంగా ఆటగాళ్లకు విరామం ఎంతో అవసరమన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్లు చాలా పరిణితితో ఉంటారని, ఆట నుంచి ఎపుడు విరామం తీసుకోవాలో వారికి తెలుసుని అన్నాడు. ప్రస్తుత భారత్ జట్టు చాలా బాగా ఆడుతుందని, 10-15 సంవత్సరాలుగా మన జట్టు ఎన్నో విజయాలు సాధించడం గర్వకారణమని అన్నాడు. ‘నేటి క్రికెటర్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. వారు ఆడదలచుకోకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో తప్పులేదు. అయితే నేటి పోటీప్రపంచంలో తీరికలేని క్రికెట్‌ ఆడుతున్నామనడంతో నేను ఏకీభవించను. ఎవరి అభిప్రాయం వారిది’ అని కపిల్‌ తెలిపారు.